Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-గుండాల
మండలంలోని పెద్దపడిశాల గ్రామంలో సీపీిఐ(ఎం), సీఐటీయూ ఆధ్వర్యంలో ఆశా,వీఆర్ ,గ్రామ పంచాయతీ వర్కర్లను సన్మానించారు.ఈసందర్భంగా సీఐటీయూ మండల కార్యదర్శి పోతరబోయిన సత్యనారాయణ మాట్లాడుతూ రెండేండ్లుగా కరోనా సైతం లెక్క చేయకుండా ప్రాణాలు ఫణంగా పెట్టి ప్రజలకు ఎల్లవేళల కరోనా సమయంలో చేసిన సేవలతో పాటు,మనోధైర్యాన్ని నింపారన్నారు.ఈకార్యక్రమంలో సీపీఐ(ఎం) గ్రామశాఖ కార్యదర్శి శాఖాపురం యాకన్న,మాజీ ఉపసర్పంచ్ పోతరబోయిన అంజయ్య,వార్డుమెంబర్ సుదర్శన్,సహాయ కార్యదర్శి ఖలీల్,శాఖాపురం లింగయ్య,బాలయ్య,ఎస్ఎఫ్ఐ నాయకులు నత్తి సతీష్,బాబు,మధు,బందెల సతీష్,ఎండి యాకూబ్ తదితరులు పాల్గొన్నారు.