Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవ తెలంగాణ-బొమ్మలరామారం
నీటి సంపులు చిన్నారి పడి మృతిచెందిన సంఘటన మండల కేంద్రంలో గురువారం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. బైస్ బాలరాజు, స్వప్న దంపతుల కూతురు నిహారిక (2) గురువారం ఉదయం ఎనిమిది గంటల సమయంలో రోజు మాదిరిగానే ఇంటి బైట ఆడుకుంటుంది. ఇంటి పక్కనే ఉన్న నీటి సంపూ మూత తెరవడంతో చిన్నారి ప్రమాదవశాత్తు సంపులో పడి మతి చెందింది. ఇది గమనించక కుటుంబ సభ్యులు గ్రామంలోని వీధుల్లో వెతికారు ఎక్కడా కనిపించకపోవడంతో ఇంటి పక్కనే ఉన్న సంపులో కుటుంబ సభ్యులు చూడగా ఆ చిన్నారి శవమై కనిపించింది. బతుకమ్మ పండుగరోజు కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి.