Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - నూతనకల్
ప్రజా ఉద్యమాల కోసం తన జీవితాన్ని అంకితం చేసిన సాకేత్ అలియాస్ ఆర్కే మృతి ప్రజా ఉద్యమాలకు తీరని లోటని సీపీఐ మండల కార్యదర్శి తోట్ల ప్రభాకర్గౌడ్ శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు, ఆర్కే మృతి విప్లవోద్యమానికి, మావోయిస్టు పార్టీకీ తీరని లోటు అని పేర్కొన్నారు. ఉపాధ్యాయుని కుమారుడైన ఆర్కే ప్రజల అభివృద్ధి కోసం ప్రజల పక్షాన ప్రభుత్వాలను విమర్శిస్తూ అనేక పోరాటాలు చేస్తూ మావోయిస్టుగా మారాడని తెలిపారు. ఆర్కే జీవితాన్ని నేటి యువత స్ఫూర్తిగా తీసుకొని ప్రజాసమస్యలపై ఉద్యమించాలని కోరారు.