Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- ఆలేరుటౌన్
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వివిధ శాఖలలో మంత్రిగా పనిచేసిన ఆలేరు మాజీ శాసనసభ్యుడు, రాజకీయ దిగ్గజం మోత్కుపల్లి నర్సింహులు ఎట్టకేలకు తిరిగి రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ సమక్షంలో టీఆర్ఎస్లో చేరేందుకు ముహూర్తం ఖరారైంది. ఈ నెల 18 తేదీన చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ఇటీవల కాలంలో బీజేపీ కేంద్ర నాయకత్వం లో చేరినప్పటికీ అందులో ఇమడలేకపోయారు .చిరకాల రాజకీయ మిత్రుడు ముఖ్యమంత్రి కెేసీఆర్ సూచన మేరకు తిరిగి టీఆర్ఎస్లో చేరుతున్నారు. దీంతో అభిమానులు సన్నిహితులు నిర్ణయాన్ని స్వాగతిస్తున్నారు .