Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి
నవతెలంగాణ- భువనగిరిరూరల్
ప్రజావాణి ద్వారా వచ్చిన ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి జిల్లా అధికారులను ఆదేశించారు. సోమవారం జిల్లా కలెక్టర్ తన ఛాంబర్లో ప్రజల నుండి 44 ఫిర్యాదులను స్వీకరించారు. వీటిలో 30 ఫిర్యాదులు రెవెన్యూ , భూ సమస్యలకు సంబంధించినవి కాగా, మిగతావి ఇతర శాఖలకు సంబంధించినవి. ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్ డి. శ్రీనివాస్ రెడ్డి, ఎఓ నాగేశ్వర చారి, అధికారులు పాల్గొన్నారు.