Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవ తెలంగాణ- భువనగిరిరూరల్
మండలంలోని బస్వాపురం గ్రామంలో నిర్మిస్తున్న రిజర్వాయర్ లో భాగంగా ముంపునకు గురవుతున్న బీఎన్ తిమ్మాపురం భూనిర్వాసితులకు నష్టపరిహారం ఇప్పించాలని కోరుతూ బుధవారం భువనగిరి ఎంపీ కోమటిరెడ్డికి గ్రామస్తులు వినతి పత్రం అందజేశారు. గతంలో భూసేకరణ చేపట్టిన సర్వేలో గ్రామంలో 1760 ఎకరాల భూమిని ప్రాజెక్టు కోసుం భూసేకరణ చేసినట్టు తెలిపారు. అందులో ఇప్పటి వరకు సుమారు ఐదు వందల ఎకరాల భూమి ఎకరాకు 15 లక్షల 60 వేల రూపాయలు చొప్పున చెల్లించినట్టు తెలిపారు. మిగిలిన భూమికి కబ్జా సీలింగ్ భూములు నష్టపరిహారం చెల్లించాలని కోరారు. వినతి పత్రం అందజేసిన వారిలో గ్రామ సర్పంచ్ పిన్నమ్ లత రాజు, మాజీ ఎంపిటిసి జిన్నా మల్లేష్, గ్రామస్తులు రావుల నందు, జిన్న కష్ణ, పిన్నం సుధాకర్, రాజు, బాబు చారి, తోటకూరి రమేష్ పాల్గొన్నారు.