Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రయివేట్ జూనియర్ కళాశాలలో ఇష్టారాజ్యంగా ఫీజుల వసూలు
- ఫీజు చెల్లించకపోతే టీసీ, మెమో, బోనఫైడ్ సర్టిఫికెట్లు ఇచ్చేందుకు నిరాకరణ
- అడిగినంత ముట్టజెబుతున్న విద్యార్థుల తల్లిదండ్రులు
- పట్టించుకోని సంబంధిత శాఖ అధికారులు
- ఆందోళనకు సిద్ధమవుతున్న విద్యార్థి సంఘాల నాయకులు
నవతెలంగాణ-నల్లగొండ
జిల్లాలో ప్రయివేట్ కళాశాలల్లో ఇంటర్ చదువుతున్న విద్యార్థులపై యాజమాన్యాలు ఫీజుల పడగ విప్పుతున్నాయి.ప్రస్తుతం ఇంటర్ సెకండియర్ చదువుతున్న విద్యార్థులతో పాటు గతేడాది ఇంటర్ పూర్తి చేసిన విద్యార్థులు పూర్తి ఫీజు చెల్లించాలని ఒత్తిడి తెస్తున్నాయి.ఆన్లైన్ తరగతులు జరుగుతున్న ప్రస్తుత తరుణంలో పూర్తి ఫీజు చెల్లించడం ఏవిధంగా సాధ్యమో తెలియక విద్యార్థులు వారి తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు.గతేడాదితో పాటు ఈ ఏడాది కూడా కరోనా విజంభిస్తున్నవేళ ఆన్లైన్ క్లాసులకే విద్యార్థులు పరిమిత మయ్యారు.గతేడాది సెకండియర్ విద్యార్థులకు ప్రభుత్వం పరీక్షలు నిర్వహించకుండానే ఫస్టియర్ మార్కుల ఆధారంగా ఉత్తీర్ణులను చేసింది.ప్రస్తుతం దోస్త్ అడ్మిషన్ల ప్రక్రియ జరుగుతున్న వేళ డిగ్రీలో అడ్మిషన్ల కోసం ఇంటర్ టీసీ, మెమోలు ఇవ్వాలంటే ప్రయివేట్ కళాశాలల యాజమాన్యాలు విద్యార్థుల నుంచి ముక్కుపిండి పూర్తి ఫీజును వసూలు చేస్తున్నాయి. జిల్లాలో ప్రయివేట్కళాశాలల ఫీజుల దోపిడీ విషయంలో విద్యార్థి సంఘాలు అనేక ఫిర్యాదులు చేస్తున్నప్పటికీ అధికారులు మాత్రం అవేమీ పట్టనట్టు వ్యవహరిస్తున్నారు.వాటిపై చర్యలు తీసుకునేందుకు వెనకాడుతున్నారు.దీంతో విద్యార్థి సంఘాలు ఆందోళనబాట పట్టేందుకు సిద్ధమవుతున్నాయి.
ఇంటర్ ఫీజులపై స్పష్టత కరువు...
ఇంటర్మీడియట్ ఫీజుల విషయంలో ప్రభుత్వం మాత్రం ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు.పాఠశాలల్లో గతేడాది ఫీజును మాత్రమే వసూలు చేయాలని.. కేవలం ట్యూషన్ఫీజు మాత్రమే అది కూడా నెలవారీగా మాత్రమే వసూలు చేయాలని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది.కానీ ఫీజుల విషయంలో మాత్రం ఇంటర్మీడియట్ బోర్డుగానీ, ప్రభుత్వంగానీ ఫీజుల విషయంలో ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. ఇదే అదునుగా ప్రైవేటు కళాశాలలు ఇష్టారీతిన ఫీజులు వసూలు చేస్తూ విద్యార్థులను ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. జిల్లాలో కొన్ని కార్పొరేట్ కళాశాలలు ఆన్లైన్ తరగతులకే విద్యార్థుల నుంచి రూ.లక్ష వరకు ఫీజు వసూలు చేస్తున్నట్టు తెలిసింది.దీనిని బట్టి జిల్లాలో ప్రయివేట్ కళాశాలల తీరుఏవిధంగా ఉందో అర్థమవుతోంది.కొన్ని ప్రయివేట్ పాఠశాలలు ప్రస్తుత కరోనా పరిస్థితులను దష్టిలో పెట్టుకుని తక్కువఫీజులు తీసు కుంటున్నప్పటికీ కళాశాలల్లో మాత్రం అధికఫీజులను వసూలు చేస్తున్నాయి.
దోస్త్ అడ్మిషన్ల వేళ దోపిడీ...
ప్రస్తుతం డిగ్రీ ప్రథమ సంవత్సరంలో ప్రవేశం కోసం ప్రభుత్వం దోస్త్ ద్వారా అడ్మిషన్లు నిర్వహిస్తోంది.ఈ అడ్మిషన్ల ప్రక్రియలో ఇంటర్ టీసీ, బోనఫైడ్, మెమో అనివార్యమైనందున ప్రైవేటు కళాశాలలు విద్యార్థులు పూర్తి ఫీజు చెల్లించకుంటే ఆ సర్టిఫికెట్లు జారీ చేయడంలేదు. దీంతో విద్యార్థుల భవిష్యత్ను దష్టిలో పెట్టుకుని వారి తల్లిదండ్రులు తప్పనిసరి పరిస్థితుల్లో మొత్తం ఫీజు చెల్లిస్తూ సర్టిఫికెట్లు తీసుకెళ్తున్నారు.కనీస సౌకర్యాలు, వసతులు కల్పించకుండా ప్రభుత్వ నిబంధనలు పాటించకుండా కళాశాలలు అధికమొత్తంలో ఫీజులు వసూలు చేస్తూ విద్యార్థుల తల్లి దండ్రు లను తీవ్రమానసిక ఆందోళనకు గురి చేస్తున్నాయి.ఈ విషయంలో విద్యార్థి సంఘాలు మండిపడుతున్నాయి.జిల్లాలో మొత్తం 53 ప్రయివేట్ ఇంటర్ కళాశాలలు ఉన్నాయి. వీటిలో గతేడాది సుమారు 8554 మంది విద్యార్థులు చదువుకుని ఇంటర్ పూర్తిచేశారు. అయితే ఆయా కళాశాలల యాజమాన్యాలు ఇంటర్ పూర్తిచేసిన విద్యార్థుల నుంచి టీసీ, మెమోల పేరుతో ఇష్టారీతిన ఫీజులు వసూలు చేస్తూ విద్యార్థులను, వారి తల్లిదండ్రులను ఇబ్బందులు పెడుతున్నాయన్న ఫిర్యాదులు వస్తున్నా అధికారులు మాత్రం చర్యలు తీసుకునేందుకు వెనకడుగు వేస్తు న్నారు. కార్పొరేట్ కళాశాలల యాజ మాన్యాలపై చర్యలు తీసుకునేందుకు అధికారులు జంకు తుండడమే దీనికి కారణంగా విద్యార్థి సంఘాలు ఆరోపి స్తున్నాయి. ఫీజుల వసూలు విషయంలో స్పష్టమైన ఆధారాలను అధికారుల దష్టికి తీసుకెళ్లినా ఆయా కళాశాలలయాజమాన్యాలపై చర్యలు తీసుకునే విషయంలో మాత్రం అధికారులు చూసీ చూడనట్టుగా వ్యవహ రించడం విమర్శలకు తావిస్తోంది. జిలా ్లవ్యాప్తంగా ప్రైవేటు కళాశాలలు ఆన్లైన్ తరగతులు నిర్వహిస్తూ ఫీజులు మాత్రం ఆఫ్లైన్ ఫీజులను తీసుకుంటున్నారనే విషయం అధికారులకు తెలిసినప్పటికీ చర్యలు తీసుకోవడంలో వెనకడుగు వేస్తున్నారు.
అధిక ఫీజులు వసూలు చేస్తే కఠిన చర్యలు.....
దస్రునాయక్, డీఐఈవో
జిల్లాలో ప్రయివేట్ ఇంటర్ కళాశాలలు అధిక ఫీజులు వసూలు చేస్తున్నాయనే విషయంలో ఫిర్యాదులు వచ్చాయి.ఈ విషయంపై పూర్తిస్థాయి విచారణ జరిపి చర్యలు తీసుకుంటాం. విద్యార్థులు తల్లిదండ్రులు ఫిర్యాదు చేస్తే కళాశాలలయాజమాన్యాలపై చర్యలు తీసుకుంటాం.