Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అడ్డగుడూర్: బునాదిగాని కాల్వ పనులను ధర్మారం వరకు వేగవంతంగా పూర్తి చేయాలని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మాటూరి బాలరాజు డిమాండ్ చేశారు. ఆ పార్టీ మండల కమిటీ ఆధ్వర్యంలో చేపట్టిన సామూహిక నిరాహార దీక్షలను ప్రారంభించి మాట్లాడారు. ఈ సందర్భంగా మండల కార్యదర్శి బుర్రు.అనిల్ కుమార్ మాట్లాడుతూ ఏండ్లు గడిచినా ప్రభుత్వాలు మారినా పనులు పూర్తి చేయడంలో ప్రభుత్వం అలసత్వం వహిస్తున్నదని విమర్శించారు. అర్హులందరికీ పింఛన్లు ఇవ్వాలని మోత్కూర్ నుండి తొర్రూరు వెళ్లే బస్సులను అడ్డగుడూర్ మీదగా వెళ్లాలని ప్రభుత్వ కార్యాలయాలకు సొంత భవనాలు నిర్మించాలని కోరారు.