Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-చౌటుప్పల్
పట్టణంలోని 20 వార్డుల్లో నెలకొన్న సమస్యలు పరిష్కరించాలని సీపీఐ(ఎం) మున్సిపల్ కమిటీ ఆధ్వర్యంలో ఈ నెల 27న మున్సిపల్ కార్యాలయం ఎదుట నిర్వహించే ధర్నాను జయప్రదం చేయాలని కోరుతూ మంగళవారం ఆ పార్టీ జిల్లా కమిటీ సభ్యులు ఎమ్డి.పాషా, మున్సిపల్ కార్యదర్శి బండారు నర్సింహా, మున్సిపల్ వైస్చైర్మెన్ బత్తుల శ్రీశైలం ఆధ్వర్యంలో ఇంటింటికి కరపత్రాలు పంపిణీచేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వర్షంతో చౌటుప్పల్ ఊరచెరువు నిండి అలుగుపోయడంతో కొన్ని నెలల నుండి పట్టణంలోని వివిధ రకాల వ్యాపారులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. మున్సిపల్ ఏర్పడినప్పటి నుండి పట్టణం అభివద్ధికి నోచుకోలేదన్నారు. సమస్యల పరిష్కారం కోసం పార్టీలకతీతంగా ప్రజలు ధర్నా కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు గోశిక కరుణాకర్, బొడ్డు అంజిరెడ్డి, ఆకుల ధర్మయ్య, బత్తుల దాసు, దాడి సురేందర్రెడ్డి, ఎర్ర ఊషయ్య, భావండ్లపల్లి స్వామి పాల్గొన్నారు.