Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-బీబీనగర్
మండలంలోని చిన్నరావులపల్లి గ్రామంలో మంగళవారం రాచకొండ సీపీ మహేశ్ భగవత్ ఆదేశాల మేరకు భువనగిరి డీసీపీ నారాయణరెడ్డి ఆధ్వర్యంలో కార్డన్ సెర్చ్ నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలో 155 మంది పోలీసు సిబ్బందితో ఇంటింటా సోదాలు నిర్వహించారు. 13వేల రూపాయల విలువ గల మద్యం, 24 టూ విలర్స్, ఒక ఆటో, ఒక కారు సీజ్చేసి, ఒక అనుమానితున్ని అదుపులోకి తీసుకున్నట్టు డీసీపీ తెలిపారు. గ్రామాల్లో శాంతిభద్రతలకు విఘాతం కలుగకుండా, యువత మత్తు పదార్థాలకు బానిసలు కాకుండా ఉండేందుకు కార్డన్ సెర్చ్ నిర్వహించినట్టు తెలిపారు. గ్రామాల్లో అనుమానితులు, అపరిచితులు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందజేయాలని తెలిపారు. ఆయనవెంట ఏసీపీ వెంకట్రెడ్డి, సీఐ జానయ్య, బీబీనగర్ ఎస్ఐ రాఘవేందర్, పోలీసు సిబ్బంది ఉన్నారు.