Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి ఎండి. జహంగీర్
నవతెలంగాణ-రాజాపేట
పేదలందరికీ డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు నిర్మించి ఇవ్వాలని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి ఎండి.జహంగీర్ అన్నారు. బుధవారం మండల కేంద్రంలో నిర్వహించిన ఆ పార్టీ మండల 7వ మహాసభ విజయలక్ష్మి అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన ప్రధానమైన హామీలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని విమర్శించారు. డబుల్బెడ్రూమ్ ఇండ్లు, పెన్షన్ ,రేషన్ కార్డులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రజా సమస్యలపై పెద్ద ఎత్తున ఆందోళనలు నిర్వహించాలని పిలుపునిచ్చారు. జిల్లాలో సాగునీటి, మౌలిక సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 29 ,30 తేదీల్లో కలెక్టరేట్ ఎదుట తలపెట్టిన 48గంటల మహాధర్నా, వంటావార్పు కార్యక్రమానికి ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. సిద్ధిపేట జిల్లా కలెక్టర్ రైతుల పై చేసిన అనుచిత వ్యాఖ్యలు ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఆ పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మంగ నరసింహులు ,జిల్లా కమిటీ సభ్యులు బబ్బురి పోశెట్టి, నాయకులు బాబూరి శ్రీనివాస్, రాజు తదితరులు పాల్గొన్నారు.