Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రాయితీ రుణాలలో జాప్యం చేయొద్దు
- అదనపు కలెక్టర్ మోహన్ రావు
నవతెలంగాణ-సూర్యాపేటకలెక్టరేట్
జిల్లాలో ప్రభుత్వం నుంచి వివిధ శాఖల ద్వారా రైతులకు, నిరుద్యోగ యువతకు రాయితీ నిధులు విడుదల చేసిన వెంటనే సకాలంలో రుణాలు మంజూరు చేసి వారి ఆర్థికాభివద్ధికి తోడ్పాటునందించాలని అదనపు కలెక్టర్ మోహన్రావు బ్యాంకు అధికారులను ఆదేశించారు.బుధవారం కలెక్టర్ కార్యాల యంలో వివిధ బ్యాంకుల అధికారులతో నిర్వహించిన జిల్లాస్థాయి బ్యాంకర్ల సమీక్ష సమావేశంలో రుణప్రణాళికపై రెండవ త్రైమాసిక సమీక్ష నిర్వహించారు.ఈ సంద ర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి బ్యాంకులకు నిర్దేశించిన లక్ష్యాన్ని వందశాతం పూర్తిచేయాలని బ్యాంకర్లను కోరారు. లబ్ధిదారుల రుణ మంజూరులో బ్యాంక్ అధికారులు ఇబ్బందులూ లేకుండా చూడాలని సూచించారు. స్వయంఉపాధి యూనిట్లకు రాయితీ విడుదలైన వారికి సకాలంలో మంజూరు చేసి గ్రౌండింగ్ చేయాలని సూచించారు.స్వయంసహాయక సంఘాలకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందని, ఆ దిశగా చర్యలు చేపట్టా లన్నారు.2021-22 ఆర్థిక సంవత్సరంలో రెండో త్రైమాసికంలో ఖరీఫ్లోని టార్గెట్ రూ.1935.57 కోట్ల పంటరుణాల లక్ష్యం కాగా రూ.577.62 కోట్లు పంట రుణం కింద రైతులకు మంజూరు చేశారని చెప్పారు. జిల్లా రుణ లక్ష్యం రూ.4147.67కోట్లకుగాను రెండుశాతం వద్ధి సాదించి రూ.1935.15 కోట్ల లక్ష్యం సాధించామన్నారు.వీటిలో అనుబంధ రంగాలైన వ్యవసాయ టర్మ్ రుణాలు రూ.850.68కోట్లు లక్ష్యం కాగా రూ. 236.53 కోట్లు అందజేశామన్నారు.విద్యారుణం కింద రూ.71.99కోట్లకు గాను రూ.15.79 కోట్లు, అలాగే పరిశ్రమలకు రూ.381.18కోట్లకు రూ.293.50 కోట్లు, స్వయం సహాయక సంఘాలకు రూ.408.09 కోట్లకు రూ.213. 48 కోట్లు రుణం అందజేశామని వివరించారు. వీధి, చిరువ్యాపారులకు రుణాలు అందిం చాలన్నారు. మహిళా సంఘాల సభ్యులు తీసుకున్న రుణాలు తిరిగి చెల్లించే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. రుణాలు అందించడంలో బ్యాంకర్ల పని తీరు ప్రశంశనియమని అభినందించారు. లబ్ది దారులకు మొండి బకాయిలను రాబట్టేందుకు అనుబంధ శాఖలు బ్యాంక్ అధికారులకు సహకరించాలని అధికారులను ఆదేశించారు.ఈ సమావేశంలో ఎల్డీఎం జగదీష్ చంద్రబోస్, ఏజీఎం సత్యనారాయణ, తేజాదీప్తి, సంక్షేమ అధికారులు శంకర్, శిరీష, డీఏఓ రామారావునాయక్, డీఐసీ తిరుపతయ్య, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.