Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-నాగార్జునసాగర్
నాగార్జునసాగర్కు కష్ణమ్మ పరవళ్లు కొనసాగుతూనే ఉంది.ఎగువ కష్ణ నదిపరివాహక ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు అన్ని ప్రాజెక్టులు నిడుకుండాల మారడంతో వచ్చినట్టు వచ్చిన వరద నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.శుక్రవారం సాగర్ జలాశయానికి 82,114 క్యూసెక్కుల వరద వస్తుండడంతో డ్యామ్ 2 క్రష్ట్ గేట్లను 10 అడుగుల మేర ఎత్తి 30,026 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.దీంతో నాగార్జున సాగర్ పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు కాగా ప్రస్తుతానికి 590.00 అడుగుల వద్ద నీరు నిల్వవుంది.పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 312.0450 టీంసీలు కాగా ప్రస్తుతానికి 312.0450 టీఎంసీలు గా ఉంది.ప్రధాన జలవిద్యుత్ కేంద్రం ద్వారా విద్యుత్ ఉత్పత్తిని చేపడుతూ 32,683 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.కుడి కాలువ ద్వారా 8529 క్యూసెక్కుల నీటిని,ఎడమ కాలువ ద్వారా 9076 క్యూసెక్కుల నీటిని,ఎస్.ఎల్.బి.సి ద్వారా 1800 క్యూసెక్కుల నీటిని మొత్తం 82,114క్యూసెక్కుల నీటిని అధికారులు దిగువకు విడుదల చేస్తున్నారు.