Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ప్రజానాట్యమండలి
రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కట్ట నర్సింహ
నవతెలంగాణ-నల్లగొండ
ప్రజాకళారూపాలు, పాటలను కాపాడాలని ప్రజానాట్యమండలి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కట్ట నర్సింహ కోరారు.మంగళవారం ప్రజానాట్యమండలి జిల్లా కమిటీ సమావేశం జిల్లాకేంద్రంలోని దొడ్డి కొమురయ్య భవన్లో నాంపల్లి చంద్రమౌళి అధ్యక్షతన నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల 15,16,17,తేదీల్లో నల్లగొండ జిల్లాలో జరిగే ప్రజాసాంస్కతిక ఉత్సవాలను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు.గ్రామీణ ప్రాంతాల్లో మతోన్మాద విషసంస్కతి పెరిగిపో తుందన్నారు.కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలకు నిరసనగా పాటలు ప్రజల్ని చైతన్యవంతం చేయడానికి ఉపయోగించాలన్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి కుమ్మరిశంకర్ జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు ఆమనగంటిఐలయ్య,చింతలవిజయ, పుట్టలసైదులు, దామెరరాజు, దండుశంకర్, పుట్టపాకఅంజయ్య, కురుపాటి శ్రీనివాస్, వనంఅడివయ్య, రాయల యాదగిరి, పల్లా ప్రసాద్, మేడి అంజమ్మ, దండు శైలజ పాల్గొన్నారు.