Authorization
Mon Jan 19, 2015 06:51 pm
డీఈవో భిక్షపతి
నవతెలంగాణ-నకిరేకల్
ప్రభుత్వ పాఠశాలలపై విద్యార్థుల తల్లిదండ్రులకు నమ్మకం కలిగే విధంగా ఉపాధ్యాయులు కషి చేయాలని నల్లగొండ డీఈఓ భిక్షపతి సూచించారు.మంగళవారం మండలంలోని నోముల,ఓగోడు జిల్లా పరిషత్ పాఠశాలలు, పాలెం యూపీఎస్ పాఠశాలలను ఆకస్మికంగా పరిశీలి ంచారు. ఆయా పాఠశాలల విద్యార్థులకు వివిధ సబ్జెక్టులపై ఉన్న అవగాహనను పరిశీలించి సంతప్తి వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనా వల్ల రెండేండ్లుగా ప్రత్యక్ష తరగతులు లేక విద్యార్థులు చదువులో వెనుకబడ్డారన్నారు.వెనుకబడిన విద్యార్థులకు గత తరగతుల జ్ఞానాన్ని గుర్తుచేస్తూ వారికి ప్రత్యేకశ్రద్ధతో బోధన చేయాలని సూచిం చారు.ఈ ఏడాది ప్రభుత్వపాఠశాలలో విద్యార్థుల సంఖ్య పెరిగిందన్నారు. మన పాఠశాలలో చేరిన విద్యార్థులు పదోతరగతి వరకు మన పాఠశాలలోనే కొనసాగే విధంగా ఉపాధ్యాయులు చూడాలన్నారు.అనంతరం నోముల జిల్లాపరిషత్ పాఠశాలలో మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు.మెనూ ప్రకారం భోజనం అందించాలని ఏజెన్సీ వారికి సూచించారు.ఆయన వెంట వివిధ పాఠశాలల హెచ్ఎంలు అరుణారాణి, చల్మరాజు, వంటల వెంకటేశ్వర్లు, పాఠశాల సిబ్బంది ఉన్నారు.