Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- టీఆర్ఎస్ జిల్లా నాయకులు శనగాని రాంబాబు గౌడ్
నవతెలంగాణ - సూర్యాపేట
సంస్కృతి, సంప్రదాయాలకు టీఆర్ఎస్ ప్రభుత్వం పెద్ద పీట వేస్తుందని ఆ పార్టీ జిల్లా నాయకులు శనగాని రాంబాబుగౌడ్ తెలిపారు. దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకుని జిల్లా కేంద్రంలోని పాత వ్యవసాయ మార్కెట్లో ఏర్పాటు చేసిన ఎస్ఆర్ ఫైర్ క్రాకర్స్ షాప్ను బుధవారం ఆయన ప్రారంభించి మాట్లాడారు. అన్ని పండుగలా మాదిరిగానే ప్రజలంతా దీపావళి పండుగను ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని కోరారు. ప్రధానంగా చిన్న పిల్లలను బాణాసంచాకు దూరంగా ఉంచాలన్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ పట్టణ నాయకులు పలస వెంకన్న, పిడమర్తి మధు, చోటు, మనీ, జమాల్ తదితరులు పాల్గొన్నారు.