Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- మఠంపల్లి
తాము కష్టపడి పండించిన ధాన్యాన్ని అమ్ముకునేందుకు గాను కావాల్సిన టోకెన్ల కోసం రైతులు శుక్రవారం స్థానిక వ్యవసాయాధికారి కార్యాలయం ఎదుట బారులు తీరారు. రైతులకు టోకెన్లు అందించే కార్యక్రమాన్ని ఎంపీపీ మూడవత్ పార్వతీ కొండనాయక్, జెడ్పీటీసీ బానోతు జగన్ నాయక్, వ్యవసాయాధికారి బుంగ రాజు ప్రారంభించారు. ఈ సందర్భంగా వ్యవసాయ అధికారి మాట్లాడుతూ మండలంలోని రైతులు పండించిన ధాన్యాన్ని మిర్యాలగూడ రైస్ మిల్లుల్లో అమ్ముకునేందుకు టోకెన్లు అందిస్తున్నామన్నారు. రైతులు పండించిన ధాన్యాన్ని పూర్తిగా కొనుగోలు చేసేందుకు అన్ని ఏర్పాట్లూ చేస్తున్నట్టు చెప్పారు. ఈ కార్యక్రమంలో రైతు సమన్వయ కమిటీ సభ్యులు హుస్సేన్, వ్యవసాయాధికారులు భవన్, శ్రావ్య తదితరులు పాల్గొన్నారు.