Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అదనపు కలెక్టర్ మోహన్రావు
నవతెలంగాణ-సూర్యాపేటకలెక్టరేట్
ప్రజావాణిలో జిల్లా నలు మూలల నుండి ప్రజలు వివిధ సమస్యలపై అందించిన దరఖాస్తులను సత్వరమే పరిశీలించి పరిష్కరిం చాలని అదనపు కలెక్టర్ మోహన ్రావు జిల్లా అధికారులను ఆదేశిం చారు.సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుండి వచ్చిన అర్జీలను స్వీకరించి మాట్లాడారు. భూ సమస్యలపై ఎక్కువగా దరఖాస్తులు అందుతున్నాయన్నారు.ప్రజావాణిలో భూసమస్యలపై 24, అలాగే ఇతర శాఖలకు సంబంధించి 19 దరఖాస్తులు మొత్తం 43 దరఖాస్తులు అందాయన్నారు.ఆయాశాఖల అధికారులు ఆ దరఖాస్తులను సత్వరమే పరిశీలించి పరిష్కరించాలని ఆదేశించారు.ఈ కార్యక్రమంలో డీపీఓ యాదయ్య, సీపీఓ వెంకటేశ్వర్లు, ఐసీడీఎస్ పీడీ జ్యోతిపద్మ, ఈడీ శిరీష, ఏఓ శ్రీదేవి పాల్గొన్నారు.