Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవ తెలంగాణ -భువనగిరి టౌన్
పట్టణంలోని స్రిగ్ధా కాలనీలో కమ్యూనిటీ భవనానికి మంగళవారం మున్సిపల్ చైర్మెన్ ఎనబోయిన ఆంజనేయులు, వైస్ చైర్మెన్ చింతల కిష్టయ్య శంకుస్థాపన చేశారు. నిధులు మంజూరు చేసిన ఎమ్మెల్సీ కృష్ణారెడ్డికి కతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక కౌన్సిలర్ జిట్టా వేణుగోపాల్ రెడ్డి, ఏవీ కిరణ్, కాలనీ అధ్యక్ష్య, కార్యదర్శులు కె. చంద్రశేఖర్ రెడ్డి, వెంకట్ రెడ్డి, దిడ్డి బాలాజీ, లక్ష్మా రెడ్డి, రఘుపతి, ఆనంతప్ప, వదిచర్ల రాజు, రామచంద్రా రెడ్డి, సోమి రెడ్డి తదితరులు పాల్గొన్నారు.