Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - నూతనకల్
మండల పరిధిలోని తాళ్ల సింగారం గ్రామానికి చెందిన మట్టపల్లి మల్లయ్య ఇటీవలే అనారోగ్యంతో మృతి చెందాడు. మృతునికి కుటుంబ సభ్యులను శుక్రవారం సర్పంచుల ఫోరం మండలాధ్యక్షుడు చూడి లింగారెడ్డి, టీఆర్ఎస్ సీనియర్ నాయకులు పన్నాల సైదిరెడ్డి పరామర్శించారు. సర్పంచ్ చూడు లింగారెడ్డి మృతుని కుటుంబానికి 50 కిలోల బియ్యం, సైదిరెడ్డి రూ.5000 ఆర్ధిక సాయం అందజేశారు. ఈ కార్యక్రమంలో యాదగిరి, పద్మ, వెంకన్న, లింగారెడ్డి, శ్రీహరి తదితరులు పాల్గొన్నారు.