Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - నల్లగొండ
త్వరలో భర్తీ చేయనున్న ఎమ్మెల్యే స్థానాల్లో నాలుగు స్థానాలు బీసీలకు కేటాయించాలని బీసీ యువజన సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కట్టెకోలు దీపేందర్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శనివారం జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో అత్యధికంగా 62 శాతానికి పైగా జనాభా ఉన్న బడుగు బలహీన వర్గాలకు నాలుగు ఎమ్మెల్సీ స్థానాలు కేటాయించాల్సిన అవసరం ఉందన్నారు. నేటికీ 90కి పైగా కులాలకు చట్టసభల్లో రాజకీయ ప్రాతినిధ్యం లేదన్నారు. ఈ సమావేశంలో బీసీ యువజన సంఘం నల్లగొండ నియోజకవర్గ అధ్యక్షుడు బోళ్ల నాగరాజు, మారోజు రాజ్కుమార్, వంశీ, దినేష్, శివప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.