Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - భువనగిరి
కళాకారులకు పెండిం గ్లో ఉన్న గుర్తింపు కార్డులు వెంటనే ఇవ్వాలని తెలంగాణ ప్రజానాట్యమండలి జిల్లా ప్రధాన కార్యదర్శి వెంకటేష్ డిమాండ్ చేశారు. శనివారం స్థానిక సీపీఐ కార్యాలయంలో సంఘం జిల్లా ఉపాధ్యక్షురాలు హేమలత అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. వృద్ధ కళాకారులకు ప్రతి నెలా రూ.5000 పెన్షన్ ఇవ్వాలని, ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలని కోరారు. అందరికీ డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు నిర్మించాలన్నారు. ఈ సమావేశంలో ప్రజానాట్యమండలి జిల్లా కమిటీ సభ్యులు చిక్క బిక్షపతి, సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు ఏశాల అశోక్ పాల్గొన్నారు.