Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కోదాడరూరల్
వ్యవసాయం వ్యవసాయ అనుబంధరంగాల అభివద్ధిలో సహకార సంఘాల పాత్ర కీలకమని కోదాడ పీఏసీఎస్ చైర్మెన్ ఆవుల రామారావు అన్నారు.ఆదివారం పట్టణంలోని పీఏసీఎస్ కార్యాలయంలో జాతీయ సహకార సంఘాల వారోత్సవాలను పురస్కరించుకుని సహకార పతాకాన్ని ఆవిష్కరించి మాట్లాడారు. గ్రామీణ ఆర్థికవ్యవస్థ బలోపేతానికి దశాబ్దాల నుండి సహకారసంఘాలు కషి చేస్తున్నాయన్నారు. వ్యవసాయరంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా సహకార సంఘాల ద్వారా రైతులకు అన్ని రకాల సహకారాలు అందిస్తున్నామన్నారు. రైతులు సహకారసంఘాల బలోపేతంలో భాగ స్వాములు కావాలన్నారు.ప్రభుత్వం ద్వారా సహకారసంఘాలు రైతులకు అందించే సౌకర్యాలను సద్వినియోగం చేసుకొని ఆర్థికంగా అభివద్ధి చెందాలన్నారు.వారోత్సవాలను పురస్కరి ంచుకొని గ్రామగ్రామాన రైతులకు అవగాహనా సదస్సులు ఏర్పాటు చేస్తున్నామన్నారు.ఈ కార్యక్రమంలో వైస్చైర్మెన్ బుడిగంనరేష్, సీఈఓ మందా వెంకటేశ్వర్లు, డైరెక్టర్లు కమతం వెంకటయ్య, ఓరుగంటి శ్రీనివాసరెడ్డి, సోమపంగు పార్వతి, గుజ్జబాబు, చంద్రమౌళి, గోబ్రా,పీఏసీఎస్ సిబ్బంది పాల్గొన్నారు.