Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-భువనగిరిటౌన్
జిల్లా కేంద్రంలోని న్యూ డైమెన్షన్స్ ఇంటర్నేషనల్ స్కూల్లో జరుగుతున్న 5వ రాష్ట్ర స్థాయి అంతర్ జిల్లాల జూనియర్ పురుషుల హాకీ టోర్నమెంట్ ఆదివారం ముగిసింది. గెలుపొందిన క్రీడాకారులకు ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి, జెడ్పీ చైర్మెన్ ఎలిమినేటి సందీప్ రెడ్డి అవార్డులు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో భారత హాకీ జట్టు మాజీ కెప్టెన్ ట్రిపుల్ ఒలింపియన్ అర్జున అవార్డు గ్రహీత ముకేశ్ కుమార్ , జిల్లా హాకీ సమాఖ్య అధ్యక్షుడు శ్రీ బుయ్య కిరణ్ కుమార్ గౌడ్, సువాలి ఎస్టేట్స్ చైర్మెన్ సుభాష్ రెడ్డి ,మున్సిపల్ చైర్మెన్ ఆంజనేయులు ,బీబీనగర్ ఎంపీపీ ఎరుకల సుధాకర్ గౌడ్ ,వైస్ చైర్మెన్ చింతల కిష్టయ్య, టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు కిరణ్ ,సీనియర్ నాయకులు ఎడ్ల రాజేందర్ రెడ్డి , కౌన్సిలర్ పంగ రెక్కల స్వామి పాల్గొన్నారు.