Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హుజూర్నగర్
ప్రయివేట్ హాస్పిటల్లో కూడా యాజ మాన్యాలు తమ హాస్పిటల్కు వచ్చే గ్రామీణ ప్రాంతప్రజలకు నాణ్యమైన వైద్య సేవలందించాలని ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి అన్నారు.ఆదివారం స్థానిక లింగగిరి రోడ్డులోని శ్రీ వెంకటేశ్వర నర్సింగ్ హోమ్లో నూతనంగా ఏర్పాటు చేసిన ల్యాప్రోస్కోపిక్ థియేటర్ను ఆయన ప్రారంభించి మాట్లాడారు. నియోజకవర్గపరిధిలోని ప్రజలు దూరప్రాంతాలకు వెళ్లకుండా ఆధునిక టెక్నాలజీతో హుజూర్నగర్లో హాస్పిటల్ ఏర్పాటు చేసి ఈ ప్రాంత ప్రజలకు అత్యుత్తమ సేవలు అందిస్తున్న డాక్టర్ శివప్రసాద్ను ఆయన అభినందించారు.చాలా అనుభవం కలిగి ఉండి సేవాభావంతో ఈ ప్రాంత ప్రజలకు వైద్య సేవలందిస్తూ నియోజకవర్గ ప్రజల ఆదరాభి మానాలు చూరగొన్న గొప్ప వ్యక్తి డాక్టర్ శివప్రసాద్ అన్నారు. రాబోయే రోజుల్లో మరిన్ని ఆధునిక సేవలను హాస్పటల్లో ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా తీసుకురావాలని సూచించారు.అనంతరం శివప్రసాద్ దంపతులు ఎమ్మెల్యేను ఘనంగా సన్మానించారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ గెల్లి అర్చన రవి, వైస్చైర్మెన్ జక్కుల నాగేశ్వరరావు,మార్కెట్ కమిటీ చైర్మెన్ కడియం వెంకట్రెడ్డి, మున్సిపల్ మాజీ చైర్మెన్లు జక్కుల వెంకయ్య, దొంతగాని శ్రీనివాస్గౌడ్, ఎస్ఐ వెంకట్రెడ్డి, కాంట్రాక్టర్ వేముల నర్సయ్య, సాయి బాబా ఎలక్ట్రికల్ షాప్ యజమాని వల్లాల వీరభద్రం,హరికృష్ణ, డయాగస్టిక్ సెంటర్ యజమాని తండ హరికష్ణ,అద్దంకి పవన్కుమార్, సీపీఐ(ఎం) మండలకార్యదర్శి ములకలపల్లి సీతయ్య పాల్గొన్నారు.