Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మర్రిగూడ
డిండి ఎత్తిపోతల పథకంలో భాగంగా చర్లగూడెం రిజర్వాయర్లో భూములు కోల్పోతున్న ముంపు గ్రామప్రజలకు, భూనిర్వాసితులకు అండగా నిలబడతామని ఎంపీటీసీ దాసరిమమతగోపాల్, ఉప సర్పంచ్ సంకబుడ్డి మమత నర్సింహ, మాజీ సర్పంచ్ దేశిడి శ్రీలతసురేందర్రెడ్డి అన్నారు. ఆదివారం నిర్వాసితులకు మద్దతుగా సంఘీభావం తెలిపారు.నిర్వాసితులు నిర్వహిస్తున్న నిరసన ఆదివారం ఐదో రోజుకు చేరుకుంది.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నిర్వాసితుల న్యాయమైన పోరాటానికి ప్రభుత్వం సహకరించి తీరాలని, ఆర్అండ్ఆర్ ప్యాకేజీ పునరావాసం కల్పించాలని కోరారు.