Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ -భూదాన్ పోచంపల్లి
ప్రజా ఉద్యమాల ద్వారానే సమస్యలు పరిష్కారమ వుతాయని, సీపీఐ(ఎం) యాదాద్రి భువనగిరి జిల్లా రెండో మహాసభలో ప్రణాళిక రూపొందించుకుని భేవిష్యత్తులో మరిన్ని పోరాటాలు నిర్వహిస్తామని ఆ పార్టీ రాష్ట్ర నాయకులు కొండమడుగు నరసింహ అన్నారు. సోమవారం పురపాలక కేంద్రంలో పెద్దన్న భవన్లో ఏర్పాటుచేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ డిసెంబర్ 5 ,6 ,7 తేదీల్లో పోచంపల్లిలో నిర్వహించే జిల్లా రెండో మహాసభలు విజయవంతం చేయాలని కోరారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైందన్నారు. దళితులకు 3 ఎకరాల పేద ప్రజలకు డబుల్ బెడ్ రూంలు ఇవ్వాలని ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చిన ఘనత కమ్యూనిస్టు లేదన్నారు, రైతులకు వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ కార్మిక చట్టాలు ప్రజలపై భారం మోపుతున్న నిత్యావసర సరుకుల డీజిల్ పెట్రోల్ ధరలను వెనక్కు తీసుకోవాలని నిరంతరం ప్రజల పక్షాన పోరాటం చేసిన ఘనత కమ్యూనిస్టులకే దక్కిందన్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించి వారం రోజులు అయినప్పటికీ ఎక్కడ చూసినా కొనుగోలు చేయడం లేదన్నారు. వెంటనే కొనుగోళ్లను వేగవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆ పార్టీ మండల కార్యదర్శి మున్సిపల్ పట్టణ శాఖ కార్యదర్శి లింగారెడ్డి ,బాల్ నరసింహ, పగడాల శివ రామ్ రెడ్డి ,జగన్ ,లక్ష్మయ్య పాల్గొన్నారు.