Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- ఆలేరుటౌన్
పీవోడబ్ల్యూ జాతీయ కన్వీనర్ వి.సంధ్య అక్రమ అరెస్టులను ప్రజా సంఘాలు, వామపక్ష పార్టీల నాయకులు, స్వచ్ఛంద సంస్థలు తీవ్రంగా ఖండించాలని సీపీఐఎంఎల్ న్యూడెమోక్రసీ జిల్లా కార్యదర్శి మామిడాల భిక్షపతి కోరారు. సోమవారం మండల కేంద్రంలోని రైల్వేగేట్ చౌరస్తా వద్ద నిరసన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆ పార్టీ డివిజన్ కార్యదర్శి ఇ సహదేవ్, ఏఐకేఎంఎస్ జిల్లా అధ్యక్షులు కళ్లెపు అడివయ్య, పీవైఎల్ జిల్లా అధ్యక్షులు మాలోతు మోతిలాల్ ,పీవోడబ్ల్యూ జిల్లా కార్యదర్శి పంగ వరలక్ష్మి,పీవైఎల్ డివిజన్ అధ్యక్షులు మారు జోడు సిద్దేశ్వర్, ఇక్కిరి బీరయ్య, , జిల్లా కార్యదర్శి యిక్కిరి శ్రీనివాస్ టంగుటూరు సర్పంచ్ కట్ట సమరసింహా రెడ్డి, ఎస్ కుమారస్వామి, తదితరులు పాల్గొన్నారు.