Authorization
Mon Jan 19, 2015 06:51 pm
జిల్లా కార్యదర్శి ఎండీ జహంగీర్
నవతెలంగాణ -వలిగొండ
డిసెంబర్ 5, 6, 7 తేదీల్లో పోచంపల్లిలో నిర్వహించే సీపీఐ(ఎం) జిల్లా మహాసభలు జయప్రదం చేయాలని ఆ పార్టీ జిల్లా కార్యదర్శి ఎండి. జహంగీర్ పిలుపునిచ్చారు. సోమవారం జిల్లా కమిటీ సభ్యులు మద్దెల రాజయ్య అధ్యక్షతన నిర్వహించిన మండల కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై నిరంతరం సీపీఐ(ఎం) పోరాడుతుందన్నారు. ్సఈఎం కేసీఆర్ ఎన్నికల్లో ఇచ్చిన హామీలు ఇప్పటికి నెరవేర్చ లేదన్నారు. జిల్లా విద్య ,వైద్యం ,ఉపాధి రంగాలలో వెనుకబడి ఉందన్నారు .పెండింగ్లో ఉన్న ప్రాజెక్టులు పూర్తి చేయడంలో విఫలమైందన్నారు. తెలిపారు జిల్లా మహాసభలో భవిష్యత్ కార్యాచరణ రూపొందించి పోరాటం నిర్వహిస్తామన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మాటూరి బాలరాజు, మండల కార్యదర్శి సిరంగి స్వామి, కార్యదర్శివర్గ సభ్యులు రామ్ చందర్ మెరుగు వెంకటేశం, మండల కమిటీ సభ్యులు కొండె కిష్టయ్య ,గాజుల అంజనేయులు, వాకిటి వెంకటరెడ్డి, ముత్యాలు, కర్ణకంటి యాదయ్య, సురేష్ జంగయ్య, దుబ్బ లింగం ,తదితరులు పాల్గొన్నారు .