Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-తుర్కపల్లి
మండలంలోని వాసాలమర్రి గ్రామంలో మంగళవారం దళితబంధ్పుఐ ఎస్సీ కార్పొరేషన్ ఆధ్వర్యంలో కార్పొరేషన్ ఈడీ శ్యాంసుందర్, పశుసంవర్ధక శాఖ జేడీ కష్ణ అవగాహనా సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వాసాలమర్రిలో 76 మంది దళిత బంధు పథకం అర్హులుకాగా అందులో పది మంది వాహనాలు తీసుకున్నట్టు తెలిపారు. మిగతా 66 మందితో సమావేశాన్ని నిర్వహించినట్టు తెలిపారు. అందులో పది మంది పౌల్ట్రీ పరిశ్రమను, మూడు కుటుంబాలు డెయిరీ పరిశ్రమను ఎన్నుకున్నట్టు తెలిపారు. అనంతరం జెర్రిపోతుల భాగ్యమ్మకు పౌల్ట్రీ పరిశ్రమకు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ కార్పొరేషన్ సూపరిండెంట్ శ్రవణ్ కుమార్ ,మండల పశువైద్యాధికారి శ్రీనివాసరావుపాల్గొన్నారు.