Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - నేరేడుచర్ల
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బేషరతుగా రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని వైఎస్సార్టీపీ నియోజకవర్గ ఇన్చార్జి జిల్లేపల్లి వెంకటేశ్వర్లు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గురువారం ఆయన స్థానిక విలేకర్లతో మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రజలు, రైతులు అనేక ఇబ్బందులు పడుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. వారి సమస్యల పరిష్కారం కోసం రాజన్న కూతురు షర్మిల తెలంగాణలో వైఎస్ఆర్ టీపీ పార్టీ పెట్టి ధర్నాలు, పాదయాత్రలు చేస్తుందన్నారు. త్వరలో రాజన్న కోరుకున్న రాజ్యం వస్తుందని, అది వైఎస్ షర్మిలమ్మతోనే సాధ్యమవుతుందని చెప్పారు. అనంతరం కర్రి సతీష్రెడ్డికి వైఎస్సార్ మండలాధ్యక్షుడిగా నియమకపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎర్రమాధ శ్రవణ్, కుతాడి రవి, యేసు, శ్రీకాంత్, వింజమూరి చందు తదితరులు పాల్గొన్నారు.