Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - నూతనకల్
రైతులు పండించిన ధాన్యాన్ని ఎలాంటి షరతులూ లేకుండా కొనుగోలు చేయాలని సీపీఐ మండల కార్యదర్శి పొట్ల ప్రభాకర్గౌడ్ డిమాండ్ చేశారు. గురువారం మండల కేంద్రంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. కొనుగోలు కేంద్రాల్లో కౌలు రైతుల ధాన్యం కొనుగోలు చేయడం లేదన్నారు. కొంత మంది రైతులకు ఆధార్కార్డుతో సెల్ నెంబర్ లింకు కాకపోవడంతో ఓటీపీ రాక అనేక ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో రామ్మూర్తి, రవి, వీరన్న తదితరులు పాల్గొన్నారు.