Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - తుంగతుర్తి
పేదలకు వైద్య సేవలందించేందుకు వైద్య సిబ్బంది ముందుండాలని జిల్లా అడిషనల్ కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్ కోరారు. గురువారం స్థానిక సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆస్పత్రిలోని గదులను పరిశీలించి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. నిరుపయోగంగా ఉన్న ఎక్స్రే మిషన్తోపాటు ఆస్పత్రిలో నెలకొన్న సమస్యల గురించి డాక్టర్తో చర్చించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ నాగునాయక్, డాక్టర్ హర్షిత, సముద్రాల సూరి, సిబ్బంది పాల్గొన్నారు.