Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హుజూర్నగర్
రాష్ట్రంలో వికలాంగులకు ఇస్తున్న పెన్షన్ను రూ.6000కు పెంచాలని వీహెచ్పీఎస్ జిల్లా అధికార ప్రతినిధి, కోదాడ నియోజకవర్గ ఇన్చార్జి బాబు డిమాండ్ చేశారు. గురువారం మండల కేంద్రంలో చలో హైదరాబాద్ పోస్టర్ను ఆవిష్కరించి మాట్లాడారు. ప్రస్తుతం ప్రభుత్వం రూ.3016 ఎటూ సరిపోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఆ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కాలం శ్రీనివాసరావు, కార్యదర్శి వై.కొండల్, నాయకులు ఇందిరాల పిచ్చయ్య, బట్టు పుల్లయ్య, సీహెచ్.వెంకటేశ్వర్లు, వీరస్వామి, సాయికిరణ్, కోలా సాంబయ్య, ఎస్కె.అభి తదితరులు పాల్గొన్నారు.