Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - సూర్యాపేట
సూర్యాపేట జిల్లా అడిషనల్ ఎస్పీగా రితీరాజ్ నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం బుధవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేసింది. 2018 బ్యాచ్కు చెందిన ఐపీఎస్ అధికారులకు పోస్టులు ఇచ్చే ప్రక్రియలో భాగంగా రితీరాజ్ను సూర్యాపేట జిల్లా అడిషనల్ ఎస్పీగా (అడ్మిన్) నియమించారు. ఆమె నేడు బాధ్యతలు చేపట్టనున్నట్టు సమాచారం. సూర్యాపేట జిల్లా ఏర్పాటైన తర్వాత ఏఎస్పీగా మొదటగా నియామకమైన గంగారాం జిల్లా నుంచి పదోన్నతిపై వెళ్లారు. నాటి నుండి జిల్లాకు అడిషనల్ ఎస్పీ నియామకం జరగలేదు.