Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-చిట్యాల
నల్లగొండలో ఈ నెల 17,18వ తేదీ లలో జరిగిన 20వ సీపీఐ(ఎం) జిల్లా మహాసభలలో మండలానికి చెందిన జిట్ట నగేష్,అవిశెట్టి శంకరయ్య లు తిరిగి జిల్లా కమిటీకి ఎన్నిక కావడంతో పాటు జిట్ట సరోజ, మల్లం మహేష్లు కొత్తగా ఎన్నికయ్యారు.సరోజ పార్టీ మండల కమిటీ సభ్యురాలుగా,ఐద్వా రాష్ట్ర నాయకురాలుగా పని చేస్తున్నారు.మల్లం మహేష్ యువజన సంఘం రాష్ట్ర, జిల్లా నాయకులుగా పనిచేస్తున్నారు.ఈ సందర్భంగా వారు శుక్రవారం మాట్లాడుతూ మండలంలో పార్టీ బలోపేతానికి కృషి చేస్తామన్నారు.ప్రజా సమస్యలపై ప్రజలను పెద్ద ఎత్తున్న సమీకరించి పోరాటాలు చేస్తామన్నారు.