Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మిర్యాలగూడ
అద్దెఇంటిలో ఓ మహిళ అనుమానాస్పదంగా మతి చెందిన ఘటన పట్టణంలోని టూ టౌన్ పోలీస్స్టేషన్ పరిధిలో ఆలస్యంగా వెలుగు లోకొచ్చింది.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..మిర్యాలగూడ పట్టణం అశోక్నగర్లోని ఓ ఇంట్లో అద్దెకు ఉంటున్న కాంతారావు నాలుగురోజుల నుండి కనిపించకుండా పోయాడు.ఈ క్రమంలోనే అతను ఉంటున్న ఇంట్లో నుండి దుర్వాసన రావడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.వెంటనే ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు ఇంట్లోకి వెళ్లి పరిశీలించారు.అక్కడ గుర్తు తెలియని మహిళ (45) మతదేహాన్ని గుర్తించారు.మతదేహం కుళ్లిపోయిన స్టేజ్లో ఉన్నట్టు తెలుస్తోంది.తీవ్ర దుర్గంధం వెదజల్లుతున్నది.మతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించారు.పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.