Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవ తెలంగాణ-మిర్యాలగూడ
భద్రాద్రి,కొత్తగూడెం జిల్లా మణుగూరులోని బొంబాయికాలనీలో తెలంగాణ సిద్ధాంత కర్త ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ సార్ విగ్రహాన్ని ధ్వంసం చేయడం చాలా హేయమైన చర్య అని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి జాజుల లింగంగౌడ్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు.ఈ దుర్మార్గాన్ని మేం తీవ్రంగా ఖండిస్తున్నామని పేర్కొన్నారు.విగ్రహాన్ని ధ్వంసం చేసిన దుండగులను గుర్తించి కఠినంగా శిక్షించాలని కోరారు.