Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హుజూర్నగర్
మండల పరిధిలోని బూరుగుగడ్డ గ్రామంలో ఉన్న ఆదివరాహ లక్ష్మీ నరసింహ వేణుగోపాలస్వామి దేవాలయ అభివృద్ధికి అన్ని విధాలుగా కృషి చేస్తానని ఆలయ చైర్మన్ కొత్త నాగరాజు తెలిపారు. శుక్రవారం కళాబంధు డాక్టర్ సుబ్బిరామిరెడ్డి సేవా కళా సమితి జిల్లా కన్వీనర్ సుతారిశ్రీనివాస్ను సన్మానించారు. ఈ సందర్భంగా చైర్మన్ నాగరాజు మాట్లాడుతూ ఆలయ అభివృద్ధికి గ్రామ ప్రజలతో పాటు భక్తులు, కౌలు రైతులు సకాలంలో కౌలు చెల్లించి సహకరిం చాలన్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు గేల్లి రవికుమార్, మండల టీఆర్ఎస్ నాయకులు వేరేవాళ్ల సుందరయ్య, బత్తిని గురువయ్య, వెంకటేశ్వర్లు, వీరనాగేశ్వరరావు, కాలువ నర్సయ్య, పేరూరి నవీన్కుమార్ తదితరులు పాల్గొన్నారు.