Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-పెద్దవూర
తెలంగాణలో గిరిజన మహి ళలపై రోజుకో ఆత్మహత్యలు, అఘాయిత్యాలు జరుగుతున్నా ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని, మహిళలకు రక్షణ లేదని ఎల్హెచ్పీ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ రవినాయక్ ఆరోపించారు.శుక్రవారం ఆయన మండలకేంద్రంలో విలేకర్లతో మాట్లాడారు.బంగారు తెలంగాణలో మహిళా భద్రత ఎక్కడ ఉందని,గిరిజనులపై దాడులు జరుగుతే ప్రభుత్వం ఎందుకు స్పందించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.తెలంగాణలో మహిళలకు భద్రత లేకుండా పోయిందని ఆరోపించారు.రాష్ట్రంలో మహిళలు, యువతులు బయట తిరిగే పరిస్థితి లేదన్నారు. గతంలో సింగరేణికాలనీలో దారుణమైన ఘటన జరిగినా, ముఖ్యమంత్రి రాకపోవడం సిగ్గుచేటని అన్నారు.కేసీఆర్కు సీఎంగా కొనసాగే హక్కులేదన్నారు.చట్టాలను మార్చాల్సిన అవసరం ఉందని తెలిపారు.