Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సూర్యాపేటకలెక్టరేట్ :ప్రజావాణిలో పలు సమస్యలపై ప్రజలు అందించిన అర్జీలను వెంటనే పరిశీలించి చర్యలు చేపట్టాలని ఆదనవు కలెక్టర్ ఎస్.మోహన్రావు జిల్లా అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన ప్రజావాణి కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ప్రజావాణిలో ఎక్కువగా భూసమస్యల దరఖాస్తులు అందాయన్నారు. తరుచుగా జిల్లాలో అకాల వర్షాలు కురుస్తున్నందున ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో అన్ని జాగ్రత్తలూ చేపట్టాలని కోరారు.ఈ కార్యక్రమంలో ఎస్సీ కార్పొరేషన్ ఈడీ శిరీష, ఐసీడీఎస్ పీడీ జ్యోతిపద్మ, ఏడీఏ రామారావునాయక్, ఎవో శ్రీదేవి, సూదర్శన్రెడ్డి, పులి సైదులు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.