Authorization
Mon Jan 19, 2015 06:51 pm
గ్రీవెన్స్లో పలు ఫిర్యాదులను పరిశీలించి మాట్లాడిన ఎస్పీ
గ్రీవెన్స్ ఫిర్యాదుల ఆన్లైన్లో నమోదు
డీఐజీ రంగనాథ్
నవతెలంగాణ-నల్లగొండ
ప్రజలకు పోలీస్ శాఖను మరింత చేరువ చేయడం లక్ష్యంగా ప్రజా సమస్యలను పరిష్కరించే విధంగా కషి చేస్తున్నామని డీఐజీ రంగనాథ్ తెలిపారు.ప్రజల సౌకర్యార్థం జిల్లా పోలీసు కార్యాల యంలో సోమవారం గ్రీవెన్స్ డే నిర్వహించారు.జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన అర్జీదారులతో నేరుగా మాట్లాడి వారి సమస్యలు తెలుసుకున్నారు.తన భూమి సమస్యను తెలియజేయడం కోసం అంబులెన్స్లో జిల్లా పోలీసు కార్యాలయానికి వచ్చిన బాధితుని దగ్గరకు నేరుగా వెళ్లి సమస్యను తెలుసుకొని సంబంధిత అధికారులతో ఫోన్లో మాట్లాడి పూర్తి వివరాలు సమర్పించాలని ఆదేశించారు.ఫిర్యాదుదారులతో మాట్లాడి వినతులు స్వీకరించి సంబంధిత ఫిర్యాదులపై వేగంగా స్పందించి పోలీసు సేవలు అందజేయాలన్నారు.ప్రతి ఫిర్యాదుదారునికి భరోసా, నమ్మకం కలిగించాలని, ప్రజల ఫిర్యాదులను స్వీకరించడానికి జిల్లా పోలీసు కార్యాలయంలో ప్రత్యేక విభాగం పని చేస్తున్నదని, ప్రతి ఫిర్యాదును ఆన్లైన్లో పొందుపరుస్తూ నిత్యం పర్యవేక్షిస్తున్నామన్నారు.