Authorization
Mon Jan 19, 2015 06:51 pm
చండూరు : తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల తోనే గ్రామాల అభివద్ధి జరుగుతున్నాయని ఎంపీటీసీల ఫోరం మండల అధ్యక్షులు గోరిగే సత్తయ్య అన్నారు. మంగళవారం మండలంలోని శేరిగూడెం గ్రామపంచాయతీ ఆవరణలో ఉపాధి హామీ పనుల ఎంపిక సభను సర్పంచ్ పంకర్ల పద్మనర్సింహ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్టీలకు అతీతంగా ఉపాధి హామీ పనులను ఎంపిక చేయాలన్నారు. కూలీలకు ఉపాధి పనులు కల్పించాలన్నారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి మమత ,వార్డు సభ్యులు, గ్రామపెద్దలు పంకర్ల నర్సింహ ,యాదయ్య ,ఐలయ్య, మద్ది మల్లేష్ ,ఆశావర్కర్లు ,అంగన్వాడీ టీచర్లు ,తదితరులు పాల్గొన్నారు.