Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-తుర్కపల్లి
ప్రమాదవశాత్తు లారీ బోల్తా పడి దగ్ధమైన సంఘటన మంగళవారం తుర్కపల్లి మండలం ములకలపల్లి గ్రామపంచాయతీ పరిధిలోని సంగ్యా తండా సమీపంలో చోటు చేసుకుంది పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హర్యానా నుండి చెన్నైకి వెళ్తున్న టీసీఐ ట్రాన్స్పోర్ట్ లారీ మంగళవారం ఉదయం అదుపుతప్పి బోల్తా పడి దగ్ధమైంది. సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని ఫైర్ ఇంజన్ సహాయంతో మంటలను ఆర్పారు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై మధుబాబు తెలిపారు.