Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-చౌటుప్పల్
డిసెంబర్ 5,6,7 తేదీల్లో భూదాన్పోచంపల్లి పట్టణకేం ద్రంలో నిర్వహించనున్న సీపీఐ(ఎం) జిల్లా ద్వితీయ మహాసభలను జయప్రదం చేయాలని కోరుతూ ఆ పార్టీ మండలకమిటీ ఆధ్వర్యంలో మంగళవారం పట్టణ కంద్రంలోని కందాల రంగారెడ్డి స్మారక భవనంలో కరపత్రాలు విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆ పార్టీ జిల్లా కమిటీ సభ్యులు రొడ్డ అంజయ్య మాట్లాడారు. ప్రజా సమస్యలు పరిష్కరించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా విఫలం చెందాయన్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు అమలుచేయడం లేదని పేర్కొన్నారు. ప్రజా ఉద్యమాలకు తగిన ఆర్థిక, హార్థిక తోడ్పాటునందిస్తూ మహాసభలు, ఉద్యమాల నిర్వహణకు విరాళాలు అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆ పార్టీ జిల్లా కమిటీ సభ్యులు బూర్గు కష్ణారెడ్డి, మండలకార్యదర్శి గంగదేవి సైదులు, నాయకులు రాగీరు కిష్టయ్య, బొజ్జ బాలయ్య, బోయ యాదయ్య, పల్లె మధుకష్ణ, శివకుమార్, ఎస్కె.మదార్, ఆదిమూలం నందీశ్వర్ పాల్గొన్నారు.