Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-సూర్యాపేటకలెక్టరేట్/భువనగిరిరూరల్/నల్లగొండ
ఈ నెల చివరి వరకు రాష్ట్రంలో వంద శాతం వ్యాక్సినేషన్ పూర్తి చేయాలని రాష్ట్ర వైద్య ఆరోగ్య, ఆర్థిక శాఖల మంత్రి టి. హరీష్ రావు సంబంధిత అధికారులను ఆదేశించారు. కరోనా వ్యాక్సినేషన్, ఒమిక్రాన్ వేరియంట్, తదితర అంశాలపై రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టర్లతో బుధవారం రాష్ట్ర కేబినెట్ సబ్ కమిటీలోని మంత్రులు హరీష్రావు కె.తారకరామారావు, సబితా ఇంద్రారెడ్డి లు హైద్రాబాద్ నుండి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ రాష్ట్రంలో 2.77 కోట్ల జనాభా లక్ష్యానికి 2.49 కోట్ల (90 శాతం) మొదటి డోస్, 1.28 కోట్ల (46 శాతం) రెండవ డోస్ వ్యాక్సినేషన్ పూర్తయిందని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 25 లక్షల 48 వేల 369 మంది సెకండ్ డోస్ కాలపరిమితి పూర్తయిన వారు వున్నారని తెలిపారు.ప్రపంచ వ్యాప్తంగా ఒమిక్రాన్ వేరియంట్ వైరస్ వ్యాప్తి జరుగుతుందని,రాష్ట్రంలో వ్యాక్సినేషన్ పూర్తి చేయడానికి, ఒమిక్రాన్ వేరియంట్ వ్యాప్తి ఎదుర్కోవడానికి సీఎం కేసీఆర్ కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేశారని మంత్రి తెలిపారు. ప్రపంచంలో నూతన కరోనా వేరియంట్ వ్యాప్తి నివారణకు వ్యాక్సినేషన్ పూర్తి చేయడం చాలా ముఖ్యమని, డిసెంబర్ చివరి వరకు వంద శాతం వ్యాక్సినేషన్ పూర్తి చేయాలని కలెక్టర్ లను మంత్రి ఆదేశించారు. పంచాయతీ, మున్సిపాలిటీల సహకారంతో మొదటి డోస్ వ్యాక్సినేషన్ జాతీయ సగటు (83 శాతం) కంటే అధికంగా రాష్ట్రంలో 90 శాతం పూర్తి చేశామని తెలిపారు. రెండవ డోస్ వ్యాక్సినేషన్ అంశంలో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పని చేసి లక్ష్యాలు పూర్తి చేయాలని మంత్రి సూచించారు. జిల్లాలోని గ్రామాలు, మండలాల మధ్య పోటీతత్వం పెంచాలని, 100 శాతం వ్యాక్సినేషన్ పూర్తి అయిన గ్రామాలను, మండలాలను ప్రకటించాలని తెలిపారు. రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖమంత్రి కె.తారకరామారావు మాట్లాడుతూ యుద్ధ ప్రాతిపదికన వ్యాక్సినేషన్ పూర్తి చేయాలన్నారు.కరోనా మొదటి, రెండవ దశల అనుభవాలను దష్టిలో ఉంచుకుని అధికారులు సన్నద్ధంగా ఉండాలనిఆదేశించారు.కరోనా నేపథ్యంలో సామాజిక మాధ్యమాల్లో పుకార్లు ప్రచారం కాకుండా చర్యలు తీసుకోవాలని, అసత్య ప్రచారాలను ఎప్పటికప్పుడు తిప్పికొట్టాలని మంత్రి స్పష్టం చేశారు. జిల్లా కలెక్టర్లు, వైద్య ఆరోగ్య శాఖ అధికారులు సామాజిక మాధ్యమాల్లో యాక్టివ్ గా ఉండాలని, ఒమిక్రాన్ గురించి వస్తున్న సమాచారాన్ని ఎప్పటికప్పుడు ప్రజలకు చేరవేయాలని తెలిపారు.రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ గ్రామస్థాయిలో వ్యాక్సినేషన్ తీసుకొనని ప్రజల వివరాలు సేకరించి సంబంధిత ప్రజాప్రతినిధులకు అందించాలని, వారితో సమన్వయం చేసుకుంటూ 100 శాతం వ్యాక్సినేషన్ పూర్తిచేసే దిశగా పనిచేయాలని తెలిపారు.వీడియోకాన్ఫరెన్స్లో రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి వ్యాక్సినేషన్ పురోగతిపై జిల్లాల వారీగా సమీక్ష నిర్వహించారు.ప్రభుత్వం వివిధ జిల్లాలో సబ్ సెంటర్ల నిర్మాణం, రేడియాలజీ ల్యాబ్లు, ఏరియాస్పత్రుల విస్తరణ, ఆర్టిఫీసీఆర్ ల్యాబ్లు మంజూరు చేసిందని వాటికి సంబంధించిన స్థలాలను వైద్యశాఖకు త్వరగా అప్పగించేలా చర్యలు చేపట్టాలని కలెక్టర్లను ఆదేశించారు.అనంతరం కలెక్టర్ టి.వినరుకష్ణారెడ్డి మాట్లాడుతూ జిల్లాలో ముందస్తుగా ప్రజలకు పూర్తి స్థాయిలో అవగాహన కల్పించి డిసెంబర్ మాసంతానికి వ్యాక్సినేషన్ పూర్తి చేసేందుకు కషి చేస్తామంటూ అలాగే థర్డ్ వేవ్ కట్టడి జిల్లాలోపటిష్ట చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఈ సందర్బంగా వివరించారు.ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ పాటిల్ హేమంత్ కేశవ్, జెడ్పీ సీఈవో సురేష్, జిల్లా వైద్యాధికారి కోటాచలం, డీఆర్డీఓ కిరణ్కుమార్, డీపీఓ యాదయ్య, డీఈఓ అశోక్, డీఐఓ డాక్టర్ వెంకటరమణ పాల్గొన్నారు.ఈ వీడియో కాన్ఫరెన్స్ లో యాదాద్రిభువనగిరి జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి, జిల్లా స్థానిక సంస్థల అడిషనల్ కలెక్టర్ దీపక్ తివారీ, జిల్లా వైద్య ఆరోగ్య అధికారి డాక్టర్ సాంబశివరావు, జిల్లా పరిషత్ సీఈవో కష్ణారెడ్డి, జిల్లా పంచాయతీ అధికారి సునంద, మున్సిపల్ కమిషనర్లు, వైద్య అధికారులు పాల్గొన్నారు.నల్లగొండ జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్, జెడ్పీ సీఈవో వీర బ్రహ్మ చారి, జిల్లా వైద్యాధికారి డా. కొండల్ రావు, డీఈఓ భిక్ష పతి, తదితరులు ఈ వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్నారు.