Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ అదనపు కలెక్టర్ చంద్రశేఖర్
నవతెలంగాణ- మునుగోడు
మునుగోడు మండలంలో ధాన్యం కొనుగోళ్లను 15 రోజుల్లోగా పూర్తిగా చేయాలని నల్లగొండ జిల్లా అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ అధికారులకు సూచించారు గురువారం మండలంలోని గూడపూర్ , మునుగోడు , కొంపెల్లి గ్రామాలలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు .కొనుగోలు కేంద్రాలలో రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను రైతులను అడిగి తెలుసుకున్నారు. లారీల కొరతతో ఎగుమతి చేయడం లేదని అదనపు కలెక్టర్ దష్టికి పలువురు రైతులు తీసుకెళ్లారు. లారీ అసోసియేషన్ వారితో ఆయన మాట్లాడి రోజు ప్రతి కొనుగోలు కేంద్రానికి 6 లారీల చొప్పున కేటాయించాలని ఆదేశించారు. ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేసేందుకు హమాలీల సంఖ్యను పెంచుకోవాలని సంబంధిత శాఖ అధికారులకు సూచించారు .ఆయన వెంట జిల్లా పౌర సరఫరాల అధికారి వెంకటేశ్వర్లు, పౌర సరఫరాల సంస్థ డీఎంనాగేశ్వరరావు, సహాయ అధికారి నిత్యానందం, తహసీల్దార్ జక్కర్తి శ్రీనివాసులు ఉన్నారు.