Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కట్టంగూర్ : కాంగ్రెస్ జిల్లా కార్యదర్శిగా మండలంలోని ఇస్మాన్పల్లి గ్రామానికి చెందిన మాద లింగస్వామిని నియమించినట్టు పార్టీ జిల్లా అధ్యక్షుడు శంకర్ నాయక్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎంపీ కోమటిరెడ్డి వెంకట్రెడ్డ్డి సూచనలతో రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆదేశానుసారం నియామక పత్రం అందజేసినట్టు పేర్కొన్నారు. ఈ సందర్భంగా మాద లింగస్వామి పార్టీని పటిష్టపరిచేందుకు తన వంతు కషి చేస్తానని పేర్కొన్నారు. తన నియామకానికి సహకరించిన ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి,జిల్లా అధ్యక్షుడు శంకర్ నాయకులకు కతజ్ఞతలు తెలిపారు.