Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ -ఆలేరుటౌన్
టీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాలపై ప్రజలను సమీకరించి కాంగ్రెస్ ఆధ్వర్యంలో చేసే యుద్ధానికి సిద్ధమని ఆ పార్టీ ఆలేరు నియోజకవర్గ ఇన్చార్జి బీర్ల అయిలయ్య ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఒకవైపు రైతులు మరోవైపు దళితులను ఇతర ప్రజలను ముఖ్యమంత్రి కేసీిఆర్ మోసం చేస్తున్నాడని పేర్కొన్నారు. అమలు కాని ప్రకటనలు చేస్తూ ప్రజలను అయోమయానికి గురి చేస్తున్నారన్నారని తెలిపారు. ప్రజలను సమీకరించి ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడతామని పేర్కొన్నారు.