Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ -భువనగిరిరూరల్
సుదీర్ఘ ప్రజా సేవకుడు, అపార అనుభవ నాయకుడు, కాంగ్రెస్ సిద్ధాంతమే తన వ్యక్తిత్వంగా మలచుకున్న మహనీయుడు మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య అని కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు కుంభం అనిల్ కుమార్ రెడ్డి అన్నారు. ఆదివారం హైదరాబాద్ లోని గాంధీ భవన్లో పీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డితో పాటుఆయన రోశయ్య చిత్రపటానికి ఘన నివాళి అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యువత ఆదర్శంగా తీసుకొని ముందుకు సాగాలన్నారు. రోశయ్య ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చేసిన సేవలను కొనియాడారు. ఆదర్శవంతమైన పరిపాలన అందించారన్నారు.